Maadhavi Latha: డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌.. సార్లు ఓ కన్నేయండి

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ( Maadhavi Latha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ లేకుండా టాలీవుడ్ పార్టీలు జరగవంటూ ఆమె సోషల్ మీడియా వేదక ద్వారా వెల్లడించారు.

Last Updated : Aug 31, 2020, 01:11 PM IST
Maadhavi Latha: డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌.. సార్లు ఓ కన్నేయండి

Madhavi Latha comments on Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ( Maadhavi Latha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ లేకుండా టాలీవుడ్ పార్టీలు జరగవంటూ ఆమె సోషల్ మీడియా వేదక ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఫెస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. టాలీవుడ్ పార్టీల్లో డ్ర‌గ్స్‌ (drugs) ను వాడుతారని.. దీనిపై తెలంగాణ  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు, ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టాలంటూ కోరారు. బాలీవుడ్ హీరో సుశాంత్ ( Sushant Singh Rajput) కేసులో ఎన్‌సీబీ అధికారులు అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నానని.. అయితే గతంలో లాగా కాకుండా టాలీవుడ్‌పై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. Also read:Amit Shah: ఎయిమ్స్ నుంచి కేంద్ర హోంమంత్రి డిశ్చార్జ్

https://www.facebook.com/ActressMaadhaviLatha/posts/3364497420253583

ఇదిలాఉంటే.. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసును సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ డ్ర‌గ్స్ తీసుకునేవాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. న‌టి కంగనా ర‌నౌత్ కూడా బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ ఉంద‌ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమలో టాలీవుడ్‌లో జ‌రిగే పార్టీల్లో డ్ర‌గ్స్ వాడుతార‌ని మాధ‌వీల‌త పేర్కొనడంతో ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.  Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Trending News