అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను చంపి ముక్కలుగా..!

ప్రస్తుతం నమోదవుతున్న నేరాల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలే. ఇటీవలే రాజస్థాన్ లో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మహిళ భర్తను ముక్కలు ముక్కలుగా నరికి మొక్కలతో పాటుగా భూమిలో నాటిన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2023, 01:45 PM IST
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను చంపి ముక్కలుగా..!

ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో ఎక్కువ శాతం అక్రమ సంబంధాల వల్లే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమ వ్యవహారాలు.. పెళ్లి తర్వాత అక్రమ సంబంధాల కారణంగా హత్యలు.. నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి అక్రమ సంబంధం కారణంగా ఏకంగా ఒక ప్రాణం పోయింది. 

వివాహితను ప్రేమించిన వ్యక్తి తమ అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడని వివాహిత భర్తను చంపేశాడు. ఆ కేసు తనపైకి రాకూడదు అనే ఉద్దేశ్యంతో మృతదేహం ను ముక్కలు ముక్కలుగా కోసి పలు చోట్ల పూడ్చి పెట్టాడు. ఈ సంఘటన గురించి పోలీసులు చెబుతూ ఉంటేనే బాబోయ్ అన్నంతగా భయం వేస్తుంది. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అన్నట్లుగా ఈ దారుణం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ లోని పాలి ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల జోగేంద్ర అనే వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. మొదట జోగేంద్ర మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేసుకున్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగేంద్ర ను వెదికేందుకు పోలీసులు మొదట ప్రయత్నించారు. కానీ జోగేంద్ర ఎక్కడ కూడా కనిపించక పోవడంతో చనిపోయి ఉంటాడేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. 

ఆ సమయంలోనే జోగేంద్ర తండ్రి తమకు మదన్ లాల్ పై అనుమానం ఉంది అన్నట్లుగా పోలీసులకు తెలియజేశాడు. దాంతో పోలీసులు మదన్ లాల్ ను స్టేషన్ కు తీసుకు వచ్చి తమదైన శైలిలో ఎంక్వౌరీ మొదలు పెట్టారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. తాను జోగేంద్ర ను చంపేసినట్లుగా మదన్‌ లాల్ ఒప్పుకున్నాడు. అంతే కాకుండా శరీరం ను ముక్కలు చేసినట్లుగా పేర్కొన్నాడు. 

Also Read: Sri Ramana: టాలీవుడ్ లో మరో విషాదం.. ‘మిథునం’ కథా రచయిత శ్రీరమణ కన్నుమూత..

మదన్ లాల్ పోలీసులకు తెలియజేసిన వివరాల ప్రకారం... జోగేంద్ర భార్య తో మదన్ లాల్ కి కొన్నాళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఆమెతో తన అక్రమ సంబంధం కంటిన్యూ అవ్వాలి అంటే జోగేంద్ర ఉండకూడదు అనుకున్నాను. అందుకే అతడిని చంపాలి అనుకున్నాను.  అనుకున్నట్లుగానే జోగేంద్ర ను చంపేసి మొండెంను అడవిలో పాతి పెట్టాను. కాళ్లు.. చేతులు.. తలను తన ఇంటికి సమీపంలో ఉన్న తోటలో పాతి పెట్టినట్లుగా పేర్కొన్నాడు.

మొత్తానికి జోగేంద్ర ను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసినట్లుగా మదన్ లాల్‌ పేర్కొన్నాడు. మదన్ లాల్‌ శరీర భాగాలను పూడ్చి పెట్టిన చోట మామిడి చెట్లు పెట్టినట్లుగా కూడా మదన్ లాల్ చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ మొత్తం వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. అక్రమ సంబంధం కోసం మరీ ఇంతగా దిగజారుతారా... మరీ ఇంతగా బరితెగిస్తారా అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News