Stock Market today: వారాంతంలో కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు- 17 వేల మార్క్ కోల్పోయిన నిఫ్టీ

Stock Market today: స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. శుక్రవారం సెషన్​లో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒమిక్రాన్ భయాలు సహా వివిధ అంశాలు ఇందుకు కారణమయ్యాయి

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 04:12 PM IST
  • భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • ఐటీ మినహా అన్ని రంగాలు కుదేలు
  • కుప్ప కూలిన బ్యాంకింగ్, ఎఫ్​ఎంసీజీ షేర్లు
Stock Market today: వారాంతంలో కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు- 17 వేల మార్క్ కోల్పోయిన నిఫ్టీ

Stock Market today: స్టాక్ మార్కెట్లు వారాంతంలో (శుక్రవారం) భారీ నష్టాలతో (Stocks Closing bell)  ముగిశాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 889 పాయింట్లు తగ్గి 57,011 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ (NSE Nify) 263 పాయింట్ల నష్టంతో 16,985 వద్ద స్థిరపడింది.

దేశంలో కరోనా ఒమిక్రాన్​ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటం నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. దీనికి తోడు వివిధ రంగాల్లో ఇటీవల నమోదైన లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడప్డారు.. ఫలితంగా సూచీలు ఒక్క సారిగా కుదేలయ్యాయి.

ఐటీ మినహా.. మిగతా అన్ని రంగాలు నేడు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్​ఎంసీజీ షేర్లు అధికంగా నష్టపోయాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 58,062 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 56,950 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,298 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,966 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 5 కంపెనీలు మాత్రమే స్వల్పంగా లాభాలను నమోదు చేశాయి. మిగతా 25 కంపెనీలు డీలా పడ్డాయి.

ఇన్ఫోసిస్​ 2.84 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 0.96 శాతం, పవర్​గ్రిడ్​ 0.82 శాతం, సన్​ఫార్మా 0.61 శాతం, టీసీఎస్​ 0.16 శాతం లాభాలను నమోదు చేశాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.89 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.55 శాతం, హెచ్​యూఎల్​ 3.43 శాతం, టైటాన్​ 3.26 శాతం, హెచ్​డీఎఫ్​సీ 3.08 శాతం నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీలు లాభాలను నమోదు చేశాయి.

షాంఘై (చైనా), టోక్యో (జపాన్​) హాంకాంగ్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు స్థిరంగా ఉంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.76 వద్ద కొనసాగుతోంది.

Also read: SBI interest rates: వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..

Also read: రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే చాలు... రూ.1.88 కోట్లు పొందవచ్చు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News