రిలయన్స్ ఇండస్ట్రీస్-సౌదీ ఆరామ్​కో డీల్​కు బ్రేక్​..!

Relaiance Aramco deal: రిలయన్స్​ ఓ2సీ వ్యాపారం, ఆరామ్​కో మధ్య డీల్​కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందాన్ని తిరిగి పరిశీలించాలని నిర్ణయించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్​ తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 12:26 PM IST
  • ఆర్​ఐఎల్​- ఆరామ్​కో డీల్​కు బ్రేక్​!
  • ఒప్పందంపై పునరాలోచనలో ఇరు సంస్థలు
  • పరస్పర చర్చల తర్వాతే నిర్ణయం
రిలయన్స్ ఇండస్ట్రీస్-సౌదీ ఆరామ్​కో డీల్​కు బ్రేక్​..!

RIL, Saudi Aramco have mutually decided to re-evaluate a major investment proposal: చమురు వ్యాపార రంగంలో ఓ భారీ డీల్​గా నిలిచిపోతుందనుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్​- సౌదీ ఆరామ్​కో డీల్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ డీల్​పై ఇరు సంస్థలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

సౌదీ ఆరామ్​కో రిలయన్స్ ఆయిల్​ టూ కెమిటకల్ (ఓ2సీ) వ్యాపారాల్లో (RIL O2C business) పెట్టుబడులను ఓ సారి పునఃపరిశీలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఇరు కంపెనీలు భావిస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.

ఇరు సంస్థల మధ్య డీల్​ ప్రణాళిక ఇలా..

రిలయన్స్ ఓ2సీ వ్యాపారాల్లో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్​కోకు విక్రయించాలని రిలయన్స్ భావించింది. దీని ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా (RIL aramco deal value) పెట్టుకుంది. సౌదీ ఆరామ్​కో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్ధగా వెలుగొందుతోంది.

ఈ డీల్​పై 2019లోనే ప్రకటన చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ​. 2020 మొదటి అర్ధభాగంలో డీల్​ పూర్తి చేయాలని భావించింది కంపెనీ. అయితే కరోనా కారణంగా ఇది సాధ్యం కాలేదు.  ఆ తర్వాత ఈ డీల్​లో జాప్యం జరుగుతూ వచ్చింది.

Also read: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Also read: వావ్: గూగుల్‌ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్

డీల్​ వెనుక కారణాలు..

నిజానికి రిలయన్స్​ ఇండస్ట్రీస్​ రుణ రహితంగా మారేందుకు గానూ.. ఈ డీల్​ చేసుకోవాలని భావించింది. అయితే కరోనా కారణంగా ఇది సాధ్యం కాకపోవడంతో.. రైట్లు ఇష్యూ సహా ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకుంది కంపెనీ. దీనితో గడువుకన్నా ముందే కంపెనీ రుణ రహితంగా మారింది. ఆరామ్​కో డీల్ పూర్తవకుండానే దీనిని సాధించడం గమనార్హం.

కాగా ఈ డీల్​ కోసం ఇప్పటికే రిలయన్స్ గ్రూప్​ నుంచి ఓ2సీ వ్యాపారాలను విడదీసి ప్రత్యేక సంస్థగా మారిచింది రిలయన్స్. దీనర్ధం రిలయన్స్ గ్రూప్​లో జియో, రిటైల్ వ్యాపారాల్లానే.. చమురు వ్యాపారాలు కూడా ప్రత్యేక సంస్థగా వ్యవహరిస్తోంది.

Also read: త్వరలో పన్ను పరిధిలోకి 'క్రిప్టో' ఆదాయం- బడ్జెట్​లో చట్ట సవరణ!

Also read: కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు, వాటి ఫీచర్స్, ధరలు, కెమెరా సెటప్ డీటేల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News