IPPB Alert: ఖాతాదారులకు ఐపీపీబీ షాక్​- వచ్చే ఏడాది నుంచి ఛార్జీల బాదుడు!

IPPB Alert: బ్యాంకింగ్ సేవల విషయంలో జనవరి 1 నుంచి కొత్త రూల్స్​ అమలులోకి తేనుంది ఇండియా పోస్ట్. ఖాతాల వారీగా విధించిన పరిమితులు దాటి చేసే లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 05:27 PM IST
  • వచ్చే ఏడాది నుంచి ఐపీపీబీ కొత్త రూల్స్​
  • పరిమితి దాటిన లావాదేవీలపై ఛార్జీల బాదుడు
  • కనీస ఛార్జీ 25 రూపాయలుగా వెల్లడి
IPPB Alert: ఖాతాదారులకు ఐపీపీబీ షాక్​- వచ్చే ఏడాది నుంచి ఛార్జీల బాదుడు!

IPPB Alert: ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank) షాకిచ్చిది. ఖాతాల్లో డబ్బు జమ చేసిన, విత్​ డ్రా చేసిన ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం బ్యాంకింగ్ రూల్స్​లో మార్పులు (India Post Payments Bank new Rules) చేసింది. సవరించిన ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి రానున్నాయి.

కొత్త రూల్స్ ఇలా..

ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మూడు రకాల అకౌంట్లను ఇస్తోంది. అవి 1.బేసిక్ సేవింగ్స్ ఖాతా. 2.సేవింగ్స్​ ఖాతా. 3.కరెంట్​ ఖాతా.

ఈ మూడు ఖాతాల్లో ప్రయోజనాలు, నగదు డిపాజిట్​, విత్​డ్రా పరిమితులు వేర్వేరుగా ఉంటాయి.

ఖాతాను బట్టి ఐపీపీబీ విధించిన పరిమితి కన్న ఎక్కువ డిపాజిట్​ చేసినా, విత్​డ్రా చేసిన ఛార్జీలు వర్తిస్తాయి.

ఆర్​బీఐ నిబంధనల ప్రకారం.. పేమెంట్ బ్యాంక్ అకౌంట్లో (Payments Bank account) రూ.లక్ష కన్నా ఎక్కువగా ఖాతాలో ఉండకూడదు. అయితే పోస్టాఫీస్​ పేమెంట్ బ్యాంక్​ ఖాతాలో మాత్రం రూ.లక్ష కన్నా అధిక మొత్తంతో ఖాతా తెరిచే వీలుంది.

బేసిక్​ సేవింగ్స్​ ఖాతాలో ఇలా..

ఐపీపీబీ అందించే బేసిక్​ సేవింగ్స్ ఖాతాలో క్యాష్ డిపాజిట్​పై పరిమితులు లేవు. ఎంత మొత్తం జమ చేసిన ఉచితమే. విత్​డ్రా చేసుకుంటే నెలకు 4 లావాదేవీలు మాత్రం ఉచితం. ఆపై జరిపే విత్​డ్రా లావాదేవీలకు కనీసం రూ.25 ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో విత్​ డ్రా చేస్తే.. ఆ విలువలో 0.50 శాతం ఛార్జీగా వసూలు చేయనుంది.

సేవింగ్స్ అకౌంట్, కరంట్​ అకౌంట్లో ఇలా..

సేవింగ్స్ ఖాతా, కరెంట్ అకౌంట్లో నెలకు రూ.10 వేల వరకు చేసే డిపాజిట్లు ఉచితం. అంతకు మించి చేసే డిపాజిట్​ లావాదేవీలపై కనీసం రూ.25 ఛార్జీ వసూలు చేయనుంది ఐపీపీబీ. లేదా డిపాజిట్ విలువలో 0.50 శాతం ఛార్జీగా వసూలు చేస్తుంది ఐపీపీబీ.

సేవింగ్స్ ఖాతా (సాధారణ ఖాతా కాకుండా)లో నెలకు రూ.25 వేల వరకు విత్​డ్రా ఉచితం. ఈ పరిమితి దాటిన తర్వాత చేసే విత్​డ్రాకు రూ.25 ఛార్జీ వసూలు చేయనున్నట్లు పోస్టల్​ పేమెంట్ బ్యాంక్ వివరించింది.

Also read: Fine on Amazon: అమెజాన్ ఇండియా సీసీఐ షాక్​- రూ.200 కోట్లు ఫైన్​

Also read: PF balance transfer: పాత పీఎఫ్ అకౌంట్​ బ్యాలెన్స్​ను కొత్త ఖాతాలోకి బదిలీ చేసుకోవడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News