బంగారం ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే

Gold Price Today 14 August 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,530గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 14, 2022, 07:38 AM IST
  • బంగారం ప్రియులకు షాక్
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
బంగారం ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే

Gold Price Today 14 August 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఒక రోజు బంగారం ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంది.. ఇంకో రోజు మాత్రం స్థిరంగా ఉంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, డాలర్ విలువ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే పసిడి ధరలు పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే కొనసాగుతాయి. 

ఇటీవల తగ్గుముఖం పట్టిన పసిడి ధరలకు మళ్లీ రెక్కలోచ్చాయి. వరుసగా మూడో రోజు పసిడి ధర పెరిగింది. ఈ  మూడు రోజుల్లో కలిపి రూ. 1200 మేర పెరిగింది. ఆదివారం (ఆగష్టు 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 48,150లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,530లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 400 .. 24 క్యారెట్ల ధరపై రూ. 440 పెరిగింది. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,690గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 48,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,530గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,610 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,580గా నమోదైంది. 
# కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 48,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,530గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,530గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 48,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,530 వద్ద కొనసాగుతోంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 48,150.. 24 క్యారెట్ల ధర రూ. 52,530గా నమోదైంది. 

మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 59,300లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే.. వెండి ధరలో రూ. 800 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 59,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 64,800లుగా ఉంది. బెంగళూరులో రూ. 64,800లుగా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 64, 800లుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి ధర రూ. 64,800ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: Horoscope Today August 14th : నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తమ ప్రేమ విషయాలను మూడో వ్యక్తితో చర్చించవద్దు...  

Also Read: World Highest Rail Bridge: ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన రైల్వే బ్రడ్జి ప్రారంభం, ఎక్కడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News