Stock Market today: బుల్​కు బడ్జెట్ బూస్ట్​- సెన్సెక్స్ 848 ప్లస్​, 17,550పైకి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ 848 పాయింట్లు పెరిగి 58,862 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 237 పాయింట్ల లాభంతో 17,577 వద్ద స్థిరపడింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 03:59 PM IST
  • స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు
  • బడ్జెట్​ 2022 సానుకూలతలే కారణం
  • లోహ, ఫార్మా రంగ షేర్ల దూకుడు
Stock Market today: బుల్​కు బడ్జెట్ బూస్ట్​- సెన్సెక్స్ 848 ప్లస్​, 17,550పైకి నిఫ్టీ

Stock Market today: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ 848 పాయింట్లు పెరిగి 58,862 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 237 పాయింట్ల లాభంతో 17,577 వద్ద స్థిరపడింది.

బడ్జెట్ 2022 మార్కెట్లకు లాభాల పంట పండించిందని విశ్లేషకులు చెబుతున్నారు. నేటి సెషన్​ ప్రారంభం నుంచి సూచూలు భారీ లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఒకానొక దశలో 1000 పాయింట్లకుపైగా లాభాన్ని నమోదు చేసింది సెన్సెక్స్​.

ఆర్థిక వృద్ధిపై వెలువడిన సానుకూల అంచనాలు, వివిధ రంగాలకు ఇచ్చిన ఊరట వల్ల సూచీలు నేడు దూసుకెళ్లాయని అంటున్నార మార్కెట్ నిపుణులు.

నేటి సెషన్​లో లోహ, ఫార్మా, ఐటీ షేర్లు భారీగా లాభాలను గడించాయి. అయితే ఆటోమొబైల్ షేర్లు కాస్త డీలా పడ్డాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో సెన్సెక్స్​ 59,032 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. ఒకానొక దశలో 57,737 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ ఇంట్రాడేలో 17,622 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,451 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 27 కంపెనీలు లాభాలను గడించాయి. 7 సంస్థలు నష్టపోయాయి.

టాటా స్టీల్​ 7.57 శాతం, సన్​ ఫార్మా 6.94 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంక్ 5.76 శాతం, ఎల్​&టీ 4.48 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 4.13 శాతం లాభాలను గడించాయి.

ఎం&ఎం 1.30 శాతం, పవర్​గ్రిడ్​ 1.18 శాతం, ఎస్​బీఐ 1.13 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 0.91 శాతం, ఎన్​టీపీసీ 0.88 శాతం నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్​) నేడు లాభాలన గడించింది. చైనీస్​ న్యూ ఇయర్ సందర్భంగా షాంఘై (చైనా), సియోల్​ (దక్షిణ కొరియా), హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు థైవాన్​ సూచీలు సెలవులో ఉన్నాయి.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి 18 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.79 వద్ద కొనసాగుతోంది.

Also read: Budget 2022: త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు..ఇకపై మీ డేటా సేఫ్..

Also read: Budget 2022: ఆశల పద్దు 2022.. బడ్జెట్​పై వివిధ వర్గాల్లో అంచనాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News