Banking alert: జనవరి 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్​- ఏటీఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు!

బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్​. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం (New Year 2022) రానుంది. కొత్త సంవత్సరం (2022 జనవరి 1) నుంచి బ్యాంకింగ్ రూల్స్​లో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్​డ్రా ఛార్జీల్లో మార్పులు (ATM Charges Chaged) చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2021, 05:10 PM IST
  • కొత్త సంవత్సరం నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు
  • లిమిట్ తర్వాత లావాదేవీలకు కొత్త ఛార్జీలు వర్తింపు
  • ఛార్జీల పెంపునకు ఇది వరకే ఆర్​బీఐ అనుమతి
Banking alert: జనవరి 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్​- ఏటీఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు!

Banking Alert: బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్​. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం (New Year 2022) రానుంది. కొత్త సంవత్సరం (2022 జనవరి 1) నుంచి బ్యాంకింగ్ రూల్స్​లో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్​డ్రా ఛార్జీల్లో మార్పులు (ATM Charges Chaged) చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బ్యాంకింగ్ వినియోగదారులకు ప్రస్తుతం ఏటీఎం ఛార్జీలు పరిమితి దాటిన తర్వాత.. ప్రతి లావాదేవీకి రూ.20 ఛార్జీగా వసూలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు రూ.21కి (New ATM Charges) పెరగనున్నాయి. దీనికి జీఎస్​టీ అదనం.

ఏటీఎం ఛార్జీలు పెంచేందుకు ఆర్​బీఐ ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త ఛార్జీల గురించి సమాచారమివ్వడం ప్రారంభించాయి.

కొత్త రూల్స్ వివరాలు ఇలా..

ఏదైన బ్యాంక్​ వినియోగదారుడు.. అదే బ్యాంక్ ఏటీఎంలో 5 సార్లు ఉచితంగా లావాదేవీలు (New Banking Rules) జరపొచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలలో అయితే మూడు  సార్లు (మెట్రో నగరాల్లో), 5 సార్లు (నాన్​ మెట్రో పట్టణాల్లో) పరిమితి.

బ్యాంక్ విధించిన ఈ పరిమితి దాటి.. తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ.21 (జీఎస్​టీ అదనం) ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ఏటీఎం లావాదేవీ నగదుతో కూడినదైన లేదా బ్యాలెన్స్ చెక్​, మిని స్టేట్​మెంట్​ కోసం అయినా.. పరిమితి మాత్రం ఐదు సార్లే.

దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ రూల్స్​ను అమలు చేయనున్నాయి.
కొత్త రూల్స్ నేపథ్యంలో తమ వినియోగదారులు.. చేసే ఏటీఎం లావాదేవీలపై ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్​ పంపనున్నాయి బ్యాంకులు. ముఖ్యంగా ఉచిత లావాదేవీ పరిమితి దాటిన తర్వాత.. ఛార్జీల వసూలు గురించి సమాచారం ఇచ్చే వీలుంది.

Also read: New year offers on iPhones: యాపిల్ వాచెస్, మ్యాక్‌బుక్స్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు, డిసెంబర్ 31 వరకే

Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి ​Twitter , Facebook

Trending News