మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు

Last Updated : Jan 10, 2019, 01:25 PM IST
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు

తిరుమల: జగన్‌ పాదయాత్ర ముగింపు సభకు జనం రాకపోవడంతో ఆ సభ వెలవెలపోయిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అసలు అర్థమే లేదని అన్నారు ప్రముఖ సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా. ప్రజాక్షేత్రంలో ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి.. ఏకంగా మంత్రి పదవి చేపట్టినందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉందని ఆయనపై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ గెలిపించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు కట్టబెట్టిన వారు సిగ్గుపడాలని వ్యాఖ్యానించిన రోజా... కోడికత్తి కేసులో టీడీపీ నేతలు జైలుకు వెళ్లే సమయం ఇంకెంతో దూరంలో లేదని అన్నారు.

ఇదిలావుంటే, నిన్ననే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన ప్రజా సంకల్ప యాత్ర ముగించుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఇవాళ తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇవాళ ఉదయం తిరుపతికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం కాలినడక మార్గం ద్వారా సాయంత్రానికి తిరుమలకు చేరుకోనున్నారు. దిగ్విజయంగా పాద యాత్ర ముగించుకున్న అనంతరం తొలిసారిగా తిరుమల వస్తున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. 

Trending News