శ్రీశైలం మల్లన్నస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి అమిత్ షా

Amit Shah Srisailam Visit: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ముగిసింది. కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 12, 2021, 03:54 PM IST
శ్రీశైలం మల్లన్నస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి అమిత్ షా

Amit Shah Srisailam Visit: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ముగిసింది. కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లన్న స్వామిని(Srisailam Mallanna Swamy) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా ముందుగా హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా..అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడ కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం మల్లన్న స్వామి క్షేత్రానికి(Amit shah visits Srisailam temple) చేరుకున్నారు. 

స్వామి దర్శనానంతరం ఆలయ అధికారులు మల్లికార్జున స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని కేంద్రమంత్రి అమిత్ షాకు బహుకరించారు. అనంతరం భ్రమరాంబ అతిధిగృహంలో భోజనానంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. అక్కడి నుంచి ఢిల్లీకు బయల్దేరారు.

Also read: సీపీఐ నోట జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News