AP: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు

ఏపీలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 77 వేల 28 పరీక్షలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది రాష్ట్ర ప్రభుత్వం. అటు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

Last Updated : Oct 28, 2020, 09:24 PM IST
  • 24 గంటల్లో 77 వేల కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా..2 వేల 949 కొత్త కేసులు
  • అంటే పరీక్షల సంఖ్యతో పోలిస్తే కేవలం 3.8 శాతం కేసులు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 26 వేలు
AP: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు

ఏపీ ( Ap ) లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ( Coronavirus tests ) రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 77 వేల 28 పరీక్షలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది రాష్ట్ర ప్రభుత్వం. అటు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

కరోనా వైరస్ ( coronavirus ) ప్రారంభం నుంచి ఏపీ ప్రభుత్వం ( Ap Government ) కోవిడ్ 19 పరీక్షలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీని ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.  గతంలో రోజుకు 10-11 వేల కేసులు వెలుగుచూసేవి. ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య 2-3 వేలకు పడిపోయింది. అటు పరీక్షల సామర్ధ్యాన్ని మాత్రం అంతకంతకూ పెంచుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 77 వేల 28 మందికి పరీక్షలు నిర్వహించగా..  2 వేల 949  కేసులు వెలుగు చూశాయి.  అంటే పరీక్షలతో పోలిస్తే..కేవలం 3.8 శాతం కేసులు నమోదయ్యాయి.

అటు ఏపీలో ఇప్పటివరకూ నిర్వ‌హించిన మొత్తం పరీక్షల సంఖ్య  77 లక్షల 73 వేల 681కి చేరుకుంది. ఇక గత 24 గంటల్లో 3 వేల 609 మంది కోలుకోగా..ఇప్పటివరకూ 7 లక్షల 81 వేల 509 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 26 వేల 622 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 18 మంది  కరోనా వైరస్ కారణంగా మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య రాష్ట్రంలో  6 వేల 643కు చేరుకుంది.

మొదట్నించి భారీగా పరీక్షలు చేస్తుండటంతో కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో తిరిగి కేసులు పెరుగుతున్న క్రమంలో..ఏపీలో తగ్గుతుండటం ఊరటనిస్తోంది. Also read: AP: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

Trending News