పీవీ సింధు, ఉపాసనలకు అరుదైన గౌరవం

పీవీ సింధు, ఉపాసనలకు అరుదైన గౌరవం

Last Updated : Sep 25, 2018, 10:14 AM IST
పీవీ సింధు, ఉపాసనలకు అరుదైన గౌరవం

ఉజ్వల భవిత కలిగిన శక్తిమంత సంపన్నుల్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, హీరో రాంచరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్‌ఛైర్‌పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెలకు చోటు లభించింది. ఫోర్బ్స్ ఇండియా తొలిసారి ప్రకటించిన 'టైకూన్స్ ఆఫ్ టుమారో' అనే జాబితాలో వీరికి చోటు దక్కింది. వ్యాపారం, చిత్ర, క్రీడా రంగాల్లో 22 మంది యువ శక్తిమంతులతో రూపొందిన ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక కీడాకారిణి పీవీ సింధు కావడం గమనార్షం.

కాగా ఈ జాబితాను ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేకంగా భారత్‌కు మాత్రమే రూపొందించింది. ఈ జాబితా రూపొందించేటప్పుడు నికర సంపదను ఆధారంగా తీసుకోలేదని సంస్థ తెలిపింది.

ఈ జాబితాలో.. అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కరణ్‌ అదానీ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ గోయెంకా, జీరోధా వ్యవస్థాపకులు నిఖిల్‌ కామత్‌.. నితిన్‌ కామత్, ఓయో రూమ్స్‌ నుంచి రితేశ్‌ అగర్వాల్‌, బిర్లా వారసురాలు, యస్‌ బ్యాంక్‌ సీఈవో రాణా కపూర్‌ కుమార్తె రాధా కపూర్‌ ఖన్నా, నటులు విక్కీ కౌశల్‌, భూమి పడ్నేకర్‌ తదితరులు చోటు దక్కించుకున్నారు.

Trending News