'నవయుగ'కే పోలవరం కాంట్రాక్టు

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీట్‌, మట్టి పనుల నిర్వహణా బాధ్యతలను నవయుగ కంపెనీకి అప్పగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Last Updated : Jan 21, 2018, 06:13 PM IST
'నవయుగ'కే పోలవరం కాంట్రాక్టు

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీట్‌, మట్టి పనుల నిర్వహణా బాధ్యతలను నవయుగ కంపెనీకి అప్పగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ నుండి కాంక్రీట్ పనులను వేరే చేస్తూ, నవయుగ యుగ కంపెనీకి ఆ బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు 1400 కోట్ల పైమాటే అని సమాచారం. గతంలో ఇవే పనులలో పురోగతి చూపించని కారణంగా ట్రాన్స్‌ట్రాయ్‌‌కి సీఎం నోటీసులు కూడా అందించారు. ఈ క్రమంలో ఈ పనులను పాతధరలకే చేయడానికి ముందుకొచ్చిన నవయుగ కంపెనీకే కాంట్రాక్టు ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఇదే ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ పనులను కూడా నవయుగ కంపెనీయే చూస్తుండడం గమనార్హం

Trending News