జనసేన జిల్లా పర్యటనలపై ప్రకటన

  

Last Updated : Nov 11, 2017, 07:48 PM IST
జనసేన జిల్లా పర్యటనలపై ప్రకటన

నేటి యువతను..మేధావులను జనసేన పార్టీలో భాగస్వామ్యం చేయడమే తమ అభిమతమని  జ‌న‌సేన పార్టీ మీడియా ఇంఛార్జ్ పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. విజ‌య‌వాడ‌లో పత్రికా గోష్టిలో మాట్లాడిన ఆయ‌న త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని జిల్లాలలోని పర్యటిస్తారని.. తద్వారా ప్రజలకు తన ఎజెండా ఏమిటో స్వయంగా వివరిస్తారని తెలియజేశారు. ప్రస్తుతం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో నిర్వాహకుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలియజేశారు. గతంలో జిల్లా కేంద్రాలలో రెండెకరాల విస్తీర్ణంలో కార్యాలయాలు నిర్మించనున్నట్లు పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్, అమరావతి ప్రాంతాలలో ఐదు లేదా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాలు కూడా నిర్మించనున్నట్లు అధికారికంగా తెలిపారు. ఆ కార్యాలయాలను యువకులు ఉపయోగించుకోడానికి వీలుగా విజ్ఞాన కేంద్రాలుగా రూపకల్పన చేయాలని కూడా పవన్ కళ్యాణ్ కోరారు. 

Trending News