AP: తిరుపతిలో భారీగా కర్ణాటక మద్యం సీజ్

మద్యపాన నిషేధం దశలవారీగా జరుగుతోంది. ఆధ్యాత్మిక నగరం తిరుమల పరిసరాల్లోనూ మద్యం  (Illicit Liquor Seized) పట్టుబడుతోంది.

Last Updated : Aug 10, 2020, 04:52 PM IST
  • ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం
  • మద్యం దొరకక కర్ణాటక, తెలంగాణ నుంచి సరఫరా
  • పోలీసులు, అధికారులకు దొరుకుతున్న ముఠాలు
AP: తిరుపతిలో భారీగా కర్ణాటక మద్యం సీజ్

ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం దశలవారీగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆధ్యాత్మిక నగరం తిరుమల పరిసరాల్లోనూ మద్యం  (Illicit Liquor Seized) పట్టుబడుతోంది. అలిపిరి దగ్గర ఎస్‌ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక నుంచి తెచ్చిన 572 మద్యం ప్యాకెట్లను సీజ్ చేశారు. Rana Daggubati వివాహంపై కోలీవుడ్ హీరో ఫన్నీ కామెంట్..!

మద్యం ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తున్న తిరుమల నగర్‌కు చెందిన మని భాస్కర్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఆటోనగర్ వద్ద తనిఖీలలో కర్ణాటక నుంచి తీసుకొస్తున్న 174 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. గౌస్ బాష, దామినీడుకు చెందిన వెంకటేశ్‌ అనే ఇద్దర్ని ఎస్ఈబీ ఏఈఎస్ సుదీర్ బాబు, ఆయన టీమ్ అరెస్ట్ చేసింది. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు 

Trending News