Cyclone Asani: కాకినాడ, విశాఖ పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్...

Asani Cyclone Live Updates: అసని తుఫాన్ కారణంగా ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో బుధవారం కూడా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 07:53 AM IST
  • అసని తుఫాన్ లైవ్ అప్‌డేట్స్
  • విశాఖ, కాకినాడ పోర్టులకు డేంజర్ సిగ్నల్
  • పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
  • తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడే ఛాన్స్
Cyclone Asani: కాకినాడ, విశాఖ పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్...

Asani Cyclone Live Updates: 'అసని' తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. మంగళవారం (మే 10) పలుచోట్ల భారీ వర్షాలు కురవగా... బుధవారం (మే 11) కూడా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కరవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో బుధవారం ఉదయం గంటకు 70కి.మీ నుంచి 80కి.మీ వేగంతో ఈదురు గాలలు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తుఫాన్ కారణంగా కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ అయింది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

మత్స్యకారులు ఎవరూ రేపటి వరకు (మే 12) సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు దెబ్బతినగా కొన్నిచోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అరటి తోటలు, బొప్పాయి తోటలు, వరి పంట బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తింది. 

తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా :

'అసని' తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడినట్లు వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్టులో వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తుఫాన్ కదిలినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకు ఆగ్నేయంగా 60కి.మీ దూరంలో, కాకినాడకు దక్షిణ నైరుతి దిశగా 180కి.మీ దూరంలో, విశాఖపట్నంకు నైరుతి దిశగా 310 కి.మీ దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్ 550 కి.మీ దూరంలో, పూరికి 660 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖవెల్లడించింది.

వాతావరణ శాఖ ప్రకారం.. అసని తుఫాన్ మరికొద్ది గంటల పాటు వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా మచిలీపట్నం, యానాం, నర్సాపూర్, కాకినాడ, తుని, విశాఖపట్నం తీర ప్రాంతాల మీదుగా ఈరోజు సాయంత్రానికి బంగాళాఖాతానికి చేరనుంది. గురువారం (మే 12) ఉదయం నాటికి తుఫాన్ వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. 

Also Read: Narayana Bail: మాజీ మంత్రి నారాయణకు ఊరట... పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్...  

Also Read: Horoscope Today May 11 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News