AP Corona Update: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి, ప్రభుత్వ చర్యలపై ఎయిమ్స్ ప్రశంసలు

AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి దాదాపుగా తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అటు ఢిల్లీ ఎయిమ్స్ సైతం ఏపీ ప్రభుత్వ చర్యల్ని ప్రశంసిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2021, 06:50 PM IST
AP Corona Update: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి, ప్రభుత్వ చర్యలపై ఎయిమ్స్ ప్రశంసలు

AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి దాదాపుగా తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అటు ఢిల్లీ ఎయిమ్స్ సైతం ఏపీ ప్రభుత్వ చర్యల్ని ప్రశంసిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)విపత్కర పరిస్థితుల్నించి ఏపీ కోలుకుంటోంది. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 69 వేలమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కేవలం 1553 కొత్త కేసులు వెలుగు చూశాయి. 16 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 631 మంది కోవిడ్ కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 వేల 210 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 60 వేల 350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 92 వేల 191 మందికి కరోనా వైరస్ సోకింది.  గత 24 గంటల్లో 2 వేల 75 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 55 లక్షల 95 వేల 949 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. ఏపీలో కరోనా నియంత్రణకై తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయంటూ ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా(Randeep Guleria) ప్రశంసించారు. జాగ్రత్తలు పాటించడంపైనే కరోనా థర్డ్‌వేవ్ అనేది ఆధారపడి ఉంటుందన్నారు. 

Also read: బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News