AP NEW CS: ఊహించిందే జరిగింది..ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం

AP NEW CS: ఊహించిందే జరిగింది. ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ రేపు పదవీ విరమణ చేస్తుండటంతో..ఆయన స్థానంలో జవహర్ రెడ్డి నియామకం ఖరారైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2022, 09:04 PM IST
AP NEW CS: ఊహించిందే జరిగింది..ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం

ఏపీ ప్రభుత్వ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం అధికారికంగా ఖరారైంది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. సీనియర్లను కాదని..ముఖ్యమంత్రి వైఎస్ జగన్..జవహర్ రెడ్డికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విధేయులు రాజకీయాల్లోనే కాదు అధికారుల్లో కూడా ఉంటారు. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా, సాన్నిహిత్యంగా మెలిగిన ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డికి అత్యున్నత పదవి ఏపీ ఛీఫ్ సెక్రటరీ వరించింది. కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌కు చెందిన కేఎస్ జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. 2024 జూన్ వరకూ ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఛీఫ్ సెక్రటరీ రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా..జవహర్ రెడ్డివైపే మొగ్గు చూపింది ప్రభుత్వం. ఐఏఎస్ అధికారిణులు పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి కేఎస్ జవహర్ రెడ్డి కంటే సీనియర్లు కావడం విశేషం. 

కేఎస్ జవహర్ రెడ్డి నేపధ్యం

1990 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కేఎస్ జవహర్ రెడ్డి..1964లో జన్మించారు. యానిమల్ హస్బెండరీ నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి ఫీడ్ టెక్నాలజీలో పీజీ చేశారు.  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ స్పెషన్ ఛీఫ్ సెక్రటరీగా, టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

1996లో నల్గొండ జిల్లా కలెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత 1998లో నీటి పారుదల, వాటర్ రిసోర్సెస్ వైస్ ఛైర్మన్ మరియు ఎండీగా వ్యవహరించారు. 1999లో ప్రాధమిక విద్య ప్రోజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2002లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించారు. 2009 అక్టోబర్ లో ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహించారు. 

సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య

మరోవైపు రాష్ట్రంలో మరికొన్ని ఐఏఎస్ బదిలీలు జరిగాయి. ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్ రెడ్డిలను నియమించింది ప్రభుత్వం. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, ఆర్అండ్‌బి సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ కమీషనర్ గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మొహమ్మద్ దివాన్‌లను నియమించింది.

Also read: Minister Roja: కబడ్డీ ఆడిన మంత్రి రోజా.. ఒక్కసారిగా మీదపడ్డ విద్యార్థులు! వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News