AP COVID-19 : తాజాగా 5,795 కరోనా కేసులు.. 33 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా తగ్గుతున్న కేసులు మళ్లీ పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది.

Last Updated : Oct 6, 2020, 06:33 PM IST
AP COVID-19 : తాజాగా 5,795 కరోనా కేసులు.. 33 మంది మృతి

Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా తగ్గుతున్న కేసులు మళ్లీ పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. గత 24గంటల్లో ( సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9గంటల వరకు ) 65,889 శాంపిళ్లను పరీక్షించగా.. 5,795 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,29,307 కి చేరగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 6,052 కి పెరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Nobel Prize 2020: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 50,776 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 6,72,479 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62,16,240 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 6,046 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Sushant Singh Rajput: రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

ఇదిలాఉంటే.. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

ap corona bulletin

Trending News