Trs Party: అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్!

Trs Party: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందని తెలుస్తోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ చేరికల కమిటి చైర్మెన్ ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో ఆయనతో ఉన్నారు పుట్ట మధు. దీంతో ఆయన బీజేపీలోచేరడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Zee Media Bureau
  • Nov 18, 2022, 05:48 PM IST

Trs Party: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందని తెలుస్తోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ చేరికల కమిటి చైర్మెన్ ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో ఆయనతో ఉన్నారు పుట్ట మధు. దీంతో ఆయన బీజేపీలోచేరడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి నుంచి ఈటల రాజేందర్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు పుట్ట మధు. ఈటల బీజేపీలో చేరినప్పుడే మధు కూడా కమలం గూటికి చేరుతారనే టాక్ నడిచింది. అయితే మధు మాత్రం పార్టీ మారలేదు. తాజాగా ఈటలతో కలిసి ఢిల్లీకి వెళ్లడంతో పార్టీ మార్ఫు ఖాయమని తెలుస్తోంది. అయితే మధు చేరికను బీజేపీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలుస్తోంది. దీంతో పార్టీ హైకమాండ్ ద్వారానే ఈటల నేరుగా మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News