Family Planning Operation Deaths: ఇబ్రహీంపట్నం ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి హరీష్ రావు

Family Planning Operation Deaths: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

  • Zee Media Bureau
  • Sep 3, 2022, 07:01 PM IST

Family Planning Operation Deaths: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రంలో ఈ నెల 25న 34 మంది మహిళలకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందటంతో పాటు పలువురు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Video ThumbnailPlay icon

Trending News