Janasena Party: వైసీపీ కాపు నేతలను అడ్డుకున్న జనసైనికులు..

Janasena Party: పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం అనుపాలెంలో వంగవీటి రంగా విగ్రహాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు వైఎస్సార్ కాపు నేతలు సన్నాహాలు చేశారు. అయితే వైసీపీ కాపు నాయకులను జనసైనికులు అడ్డుకున్నారు.

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 06:26 PM IST

Janasena Party: పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం అనుపాలెంలో వంగవీటి రంగా విగ్రహాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు వైఎస్సార్ కాపు నేతలు సన్నాహాలు చేశారు. అయితే వైసీపీ కాపు నాయకులను జనసైనికులు అడ్డుకున్నారు. పాలాభిషేకం చేసేందుకు ఇది సందర్భం కాదని జనసేన నేతలు తెలిపారు.  ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ కాపు నాయకులు రంగా విగ్రహాన్ని మలినం చేస్తే ఊరుకోమని జనసేన నేతలు హెచ్చరించారు. జనసేన కార్యకర్తలు రంగా విగ్రహం దగ్గర ప్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News