KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. వారం రోజులు అక్కడే మకాం

CM KCR Delhi Tour:  తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పటిలాగే ఈ పర్యటనలోనూ వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు జరపనున్నారు.

  • Zee Media Bureau
  • Dec 12, 2022, 08:03 PM IST

CM KCR in Delhi Tour: ఢిల్లీలో బిఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు రాజశ్యామల యాగం చేయనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఢిల్లీలో మకాం వేసి పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News