తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్టంలోని ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Last Updated : Feb 20, 2020, 01:58 PM IST
తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్..

హైదరాబాద్:  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్టంలోని ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇదివరకు ఎస్‌సి గురుకుల డిగ్రీ మహిళా కళాశాలల్లో 19 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్‌లో అదనంగా ఈ పోస్టులను చేర్చారని, దాంతో మొత్తం 34 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ కానున్నట్లు తెలపగా ఈ పోస్టులకు అభ్యర్థులు మార్చి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టిఆర్‌ఇఐ-ఆర్‌బి ఛైర్మన్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.

ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులకు పీజీలో 55 శాతం మార్కుల అర్హత పరిమితిని ప్రస్తుతం 50 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఇంతకుముందు గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి మార్చి 10 వరకు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ఎలాంటి రుసుము లేకుండా క్రమాన్ని మార్చుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్థుదారుల సౌకార్యార్థం కొరకై అన్నీ పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040- 23317140 నెంబరులో సంప్రదించాలని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News