తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలను సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.

Last Updated : Apr 27, 2018, 10:18 PM IST
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలను సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సంవత్సరం తెలంగాణలో మొత్తం 5,34,726 మంది రెగ్యులర్  విద్యార్థులు, 25,763 ప్రైవేటు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా అందులో 83% ఉత్తీర్ణత సాధించారు.

అయితే ఈ  పదో తరగతి ఫలితాల్లో బాలల కన్నా బాలికలదే ఎక్కువ హవా కొనసాగడం విశేషం. 2017లో 84% విద్యార్థులు విజయం సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించబడ్డాక, రెండు రాష్ట్రాలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి..  వేరు వేరుగా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించాయి. అలాగే ఒకప్పుడు ఉన్న మార్కుల విధానానికి స్వస్తి చెప్పి... విద్యార్థులకు సబ్జెక్టుల్లో గ్రేడులనే ఈ బోర్డులు అందిస్తున్నాయి.

తెలంగాణలో ఇటీవలే  రాష్ర్టవ్యాప్తంగా జరిగిన పదవి తరగతి పరీక్షల్లో 2125 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. కాగా 21 పాఠశాలలు మాత్రం జీరో పర్సెంట్ ఉత్తీర్ణత నమోదు చేయడం గమనార్హం. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా చివరిస్థానంలో ఉంది. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in లేదా http://results.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 

Trending News