COVID-19 Positive Cases: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, Holi సమయంలో బీ కేర్‌ఫుల్

COVID-19 Positive Cases In Telangana | నిన్నటితో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 400కు పైగా కేసులు నిర్ధారించారు. తెలంగాణలో తాజాగా 403 మంది కరోనా బారిన పడ్డారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 29, 2021, 10:05 AM IST
  • తెలంగాణలో తాజాగా 403 మంది కరోనా బారిన పడ్డారు
  • మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,742కు చేరింది
  • సోమవారం ఉదయం ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది
COVID-19 Positive Cases: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, Holi సమయంలో బీ కేర్‌ఫుల్

Telangana COVID-19 Positive Cases: గత కొన్ని రోజులుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్నటితో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 400కు పైగా కేసులు నిర్ధారించారు. తెలంగాణలో తాజాగా 403 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,742కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 33,930 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 403 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ జరిగింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 6 వేల 7 వందల నలభై రెండుకు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,690కి చేరింది.

Also Read: Corona Vaccine: దేశంలో 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా టీకాలు, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం

గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరిగింది. ఆదివారం నాడు 313 మంది చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,00,469 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

Also Read: Telangana Coronavirus Update: తెలంగాణలో నైట్‌కర్ఫ్యూ లేదా పాక్షిక లాక్‌డౌన్ దిశగా ప్రయత్నాలు

జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో 146 జీహెచ్ఎంసీలోనే నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ సేవ్ కారణంగా హాస్టళ్లు, మెస్‌లు సైతం మూసివేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 1,815 మంది చికిత్స పొందుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News