COVID-19 : తెలంగాణలో భారీగా నమోదవుతున్న కరోనా మరణాలు

Telangana COVID-19 Positive Cases: గాలి ద్వారా 10 నిమిషాల్లో వ్యాప్తి చెందే కరోనా వైరస్ రెండో దశలో కేవలం నిమిషం వ్యవధిలో వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 19, 2021, 10:29 AM IST
COVID-19 : తెలంగాణలో భారీగా నమోదవుతున్న కరోనా మరణాలు

Telangana COVID-19 Positive Cases: కరోనా వైరస్ రెండో దశలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. గాలి ద్వారా 10 నిమిషాల్లో వ్యాప్తి చెందే కరోనా వైరస్ రెండో దశలో కేవలం నిమిషం వ్యవధిలో వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తాజాగా 4,009 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,55,433కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 83,089 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 4 వేల 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 55 వేల 4 వందల 33కి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 14 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,838కి చేరింది. ఏప్రిల్ ప్రారంభంలో రెండు, మూడుగా నమోదయ్యే కరోనా మరణాలు తాజాగా ప్రతిరోజూ 10కి పైగా నమోదు కావడంతో కరోనా(CoronaVirus) వ్యాప్తి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి

తెలంగాణలో అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు  జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 705 కరోనా కేసులు జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో నిర్ధారణ కావడం హైదరాబాద్ నగర వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 39 వేల 154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1,18,20,842 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19) నుంచి 1,878 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,14,441 మంది కరోనా మహమ్మారిని జయించారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్యశాఖ సూచించింది. ముఖానికి మాస్కు ధరించడం, చేతులను పదే పదే శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చునని ప్రజలకు సూచిస్తున్నారు.

Also Read: Remdesivir Injections: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అక్రమంగా విదేశాలకు సరఫరా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News