COVID-19 Positive Cases: తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా, తాజాగా 3 వేల పైగా పాజిటివ్ కేసులు

Telangana COVID-19 Positive Cases: తాజా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే 406 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 13, 2021, 11:42 AM IST
  • తెలంగాణలో మరోసారి మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు
  • గడిచిన 24 గంటలలో తాజాగా మరో ఏడుగురిని బలిగొన్న కోవిడ్ మహమ్మారి
  • తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ
COVID-19 Positive Cases: తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా, తాజాగా 3 వేల పైగా పాజిటివ్ కేసులు

Telangana Corona Cases : కరోనా వైరస్ రెండో దశలో తెలంగాణలో పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో దేశంలో ప్రతిరోజూ లక్షకు పైగా నిర్ధారణ అయ్యే కరోనా కేసుల సంఖ్య తాజాగా లక్షన్నరకు చేరుకుంది. తెలంగాణలో తాజాగా 3,052 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,581కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం (ఏప్రిల్ 13న) ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి 8 గంటల వరకు గత 24 గంటల్లో 1,13,007 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో మూడు వేల యాభై రెండు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 32 వేల 5 వందల 81కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ రాష్ట్రంలో మరో ఏడుగురు వ్యక్తులు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,772కి చేరింది.

Also Read: Ugadi Pachadi Recipe: షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తయారుచేయు విధానం, ప్రాముఖ్యత

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఓ వైపు కరోనా టెస్టులు పెంచడంతో పాటు మరోవైపు కోవిడ్19 నిబంధనలు కఠినతరం చేసింది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగిన వారికి రూ.1000 జరిమానా విధించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. సోమవారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19(Covid-19) నుంచి 778 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,06,678 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

Also Read: Ugadi 2021 Wishes: మీ సన్నిహితులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి

తాజా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే 406 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 24 వేల 131 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం క్వారంటైన్‌లో 16,118 మంది చికిత్స పొందుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News