తెలంగాణ మహానాడుకు సీనియర్ నేత మోత్కుపల్లి డుమ్మా

                               

Last Updated : May 24, 2018, 04:27 PM IST
తెలంగాణ మహానాడుకు సీనియర్ నేత మోత్కుపల్లి డుమ్మా

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం వేదికగా తెలంగాణ టీడీపీ మహానాడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే  ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ , దేవేందర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.  కాగా ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేత మొత్కపల్లితో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మహానాడుకు హాజరుకాకపోవడం గమనార్హం.  

గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో పాటు పలువురు నేతలు ప్రసంగించారు.  తెలుగుదేశం పార్టీ నేతల ప్రసంగాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సాగుతున్నాయి.ఈ సందర్భంగా ఎనిమిది అంశాలపై తీర్మానాలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీర్మానాలను ప్రవేశపెట్టారు . ఇదిలా ఉండగా 2019లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిలోపే సమయం ఉండటంతో ఈ మహానాడు ప్రాధాన్యం సంతరించుకుంది.

Trending News