కరోనా భయంతో కన్నుమూత..!!

దేశంలో కరోనా భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. కరోనా తమకు సోకిందనే భయంతో కొందరు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇవాళ హైదరాబాద్‌ లోని రామంతాపూర్‌లో చోటు చేసుకుంది.

Last Updated : May 2, 2020, 12:33 PM IST
కరోనా భయంతో కన్నుమూత..!!

దేశంలో కరోనా భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. కరోనా తమకు సోకిందనే భయంతో కొందరు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇవాళ హైదరాబాద్‌ లోని రామంతాపూర్‌లో చోటు చేసుకుంది.

వాసిరాజు కృష్ణమూర్తి(60) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి రామంతాపూర్‌లోని వీఎస్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా వాసిరాజు ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని కింగ్‌ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. కరోనా లక్షణాలు లేవని వైద్యులు చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చారు. 

భారత్‌లో 24 గంటల్లో 71 మంది మృతి
అయినప్పటికీ వాసిరాజు తనకు కరోనా ఉందేమోనని ఆందోళన చెందుతుండటంతో.. ఆ తర్వాత  సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఆయన ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News