తెలంగాణ ఎన్నికలు : సామాన్యులతో పోటీపడి మరి.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Last Updated : Dec 7, 2018, 12:54 PM IST
తెలంగాణ ఎన్నికలు : సామాన్యులతో పోటీపడి మరి.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటు  వేసేందుకు మహిళాలు, దివ్యాంగులు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు.సామాన్యులతో పోటీ పడి మరి రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖలు సాధారణ క్యూలైన్లో నిలబడి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. 

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల జాబితా:

 

* సిద్ధిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

* నల్గొండలో ఓటు వేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

* మైలార్ దేవ్‌పల్లి ఓటు వేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

*జడ్చర్ల మండంల బాదేపల్లిలో ఓటు హక్కువినియోంచుకున్న సునీతా లక్ష్మారెడ్డి

*జూబ్లీహిల్స్ ఓటు వేసిన సినీ హీరో అల్లు అర్జున్

* మిర్యాలగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి

*చిక్కడపల్లిలో ఓటు వేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

* షేక్ పేటలో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు రాజమౌళి

* జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, నాగార్జున

* కాచిగూడలో ఓటు వేసిన బీజేపీ నేత కిషన్ రెడ్డి

* గొల్లగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న తుమ్మల నాగేశ్వరరావు

* సూర్యపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న జగదీష్ రెడ్డి

* ఎల్లపల్లిలో ఓటు వేసిన  ఇంద్రకరణ్ రెడ్డి 

* ఫిల్మ్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకన్న సానియా మీర్జా

*  బాన్సువాడ పోచారం గ్రామంలో ఓటు వేసిస పోచారం శ్రీనివాస్ రెడ్డి

* మెహదీపట్నం నుంచి ఓటు హక్కు వినియెగించుకున్న నందమూరి సుహాసిని

Trending News