కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం పూర్తి

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం పూర్తి

Last Updated : Jun 19, 2019, 06:02 PM IST
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం పూర్తి

హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు నేడు శాసన మండలిలో ప్రమాణస్వీకారం చేశారు. పట్నం మహేందర్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రావు కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో వున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఎమ్మెల్సీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌ రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి (వరంగల్‌), తేరా చిన్నప రెడ్డి (నల్లగొండ) విజయం సాధించగా ఎమ్మెల్యేల కోటా కింద నవీన్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 

మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మల్లా రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌ రెడ్డి, మహేశ్‌ రెడ్డి, సుభాష్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపూడి గాంధీ, ఆనంద్‌, బాల్క సుమన్‌, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఈ కార్యక్రమానికి హాజరై నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలను అభినందనలు తెలియజేశారు.

Trending News