పదేళ్ల క్రితం చనిపోయినా..ఇప్పుడు ఓటు హక్కు

ఓటర్ల జాబితాలో 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులకూ ఇప్పుడు ఓటు హక్కు కలించారు.

Last Updated : May 22, 2018, 10:29 AM IST
పదేళ్ల క్రితం చనిపోయినా..ఇప్పుడు ఓటు హక్కు

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకై రూపొందించిన ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలానికి సంబంధించిన జాబితాలో.. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులకూ ఇప్పుడు ఓటు హక్కు కలించారు. అటు ఓ వార్డులోని వ్యక్తి పేరు మరో వార్డు జాబితాలో ఉండటం సహా కొందరి పేర్లు గల్లంతైనట్లు ఆరోపణలున్నాయి.

బషీరాబాద్ మండలంలోని ప్రతి గ్రామంలో కనీసం పది శాతం మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. కానీ ఆ పేర్లపై రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపితే తొలగిస్తామని, లేదా వారి కుటుంబ సభ్యులెవరైనా చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ చూపిస్తే తొలగిస్తామని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. తొలగించే అధికారం కూడా కేవలం ఎమ్మార్వోలకు మాత్రమే ఉందని ఆ మండల ఎంపీడీఓ చెప్పారు.

ఇదిలా ఉండగా.. గతంలో 16 పంచాయతీలు ఉన్న తాండూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా 20 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో 220 జనాభా గల హంక్యా నాయక్‌ తండా ఓ  గ్రామపంచాయతీగా ఏర్పడింది.

Trending News