Munugode Result: చౌటుప్పల్ మండలంలో మంత్రులకు షాక్.. మునుగోడులో హోరాహోరీ ఫైట్

Munugode Result: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

Written by - Srisailam | Last Updated : Nov 6, 2022, 12:10 PM IST
Munugode Result: చౌటుప్పల్ మండలంలో మంత్రులకు షాక్.. మునుగోడులో హోరాహోరీ ఫైట్

Munugode Result Live Updates: మునుగోడు ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు లీడ్ లు మారిపోతున్నాయి. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం రాగా.. రెండు, మూడు రౌండ్లలో బీజేపీకి లీడ్ వచ్చింది. నాలుగు రౌండ్ లో మళ్లీ టీఆర్ఎస్ కు లీడ్ వచ్చింది. మొదటి నాలుగు రౌండ్ల ఓట్లు చౌటుప్పల్ మండలానికి సంబంధించినవి. చౌటుప్పల్ మండలంలో ఓవరాల్ గా  టీఆర్ఎస్ స్వల్ప లీడ్ సాధించింది. మొత్తం నాలుగు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 714  ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

చౌటుప్పల్ మండలానికి సంబంధించి అధికార పార్టీ కీలక నేతలకు షాక్ తగిలింది. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఇంచార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జుగా ఉన్న లింగోజిగూడెంలో బీజేపీకి దాదాపు రెండు వందల ఓట్ల లీడ్ వచ్చింది. మల్లారెడ్డి  ఇంచార్జ్ గా ఉన్న ఆరెగూడెం, వేముల ప్రశాంత్ రెడ్డి ఇంచార్జుగా ఉన్న దేవలమ్మ నాగారంలో కమలం పార్టీకి ఓటర్లు జై కొట్టారు.

 

Trending News