తలచుకుంటే ..ఉద్యమాన్ని 5 నిమిషాల్లో అణచివేసే వారట - జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్

                      

Last Updated : Sep 28, 2018, 05:16 PM IST
తలచుకుంటే ..ఉద్యమాన్ని 5 నిమిషాల్లో అణచివేసే వారట - జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ... కాంగ్రెస్ వాళ్లు తలచుకుంటే 5 నిమిషాల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నిఅణచి వేసే వాళ్లమని కాంగ్రెస్ నేత జానారెడ్డి అంటున్నారు..ఇది  కాంగ్రెస్ వాళ్ల ఫ్యూడల్ మనస్తత్వానికీ... పొగరుబోతుతనానికి ఇదే నిదర్శనం’ అంటూ జానారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్లింగ్ షేర్ చేసుకున్నారు.

ఈ వీడియోలో జానా ఏమన్నారంటే...?
పాకిస్తాన్ తో యుద్దం వచ్చినా ఈజీగా ఎదరించినటువంటి భారత ప్రభుత్వం..ఉగ్రవాదుల్సి ఉరుకులు పెట్టిస్తున్న బలమైన  కేంద్ర ప్రభుత్వం.. ఉద్యమం పేరుతో కేసీఆర్ ఆయన ఆధర్యంలో గుప్పెడు మంది అటూఇటూ అందోళన చేస్తే ఈ రాష్ట్రం ఏర్పడుతుందా ?..ఇది సాధ్యం అయ్యే పనేనా ? వాస్తవానికి కేంద్రం తలచుకున్నట్లయితే వారి ఆందోళనను ఐదు నిమిషాల్లో అణచివేయగలదు అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్ణయం వల్లే తెలంగాణ  ఇచ్చిందనే అర్థం వచ్చేలా ఆయన స్పందించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఈ వీడియో క్లిప్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసి..జానారెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మంత్రి కేటీఆర్ షేర్ చేసిన వీడియో మీరూ చూడగలరు...
 

 

 

Trending News