టీజేఎస్ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇచ్చిన కోదండరాం 

                                 

Last Updated : Nov 16, 2018, 06:02 PM IST
టీజేఎస్ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇచ్చిన కోదండరాం 

టీజేఎస్ పోటీ చేసే స్థానాలపై కోదండరాం స్పందించారు. తాము ప్రకటించినట్లుగానే టీజేఎస్ 12 స్థానాల్లో బరిలో ఉంటుందని..వాటిలో రెండు స్థానాల్లో కాంగ్రెస్, టీజేఎస్ పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందన్నారు. స్పష్టత వచ్చిన స్థానాల్లో అభ్యర్ధులకు రేపు బీ ఫామ్స్ ఇస్తామన్నారు. తమ ప్రచారంలో సీపీఐ రాష్ట్ర కాద్యదర్శి చాడా వెంకట్ రెడ్డి కూడా పాల్గొంటారని కోదండరాం పేర్కొన్నారు.  

సీట్ల కేటాయింపులో జాప్యం జరిగిన మాట వాస్తమన్న కోదండరాం ..ఉమ్మడి మ్యానిఫెస్టోను ఇప్పటికే ప్రటించాల్సి ఉందన్నారు. అయితే జరుగుతున్న నష్టాన్ని పూడ్డేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.  ఎన్నికల్లో ఉమ్మడి కార్యచరణతో ముందుకు వెళ్లామని..దీని పై చర్చించేందుకు రేపు టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్  కుంతియాలు తమ పార్టీ కార్యాలయానికి వస్తారని కోదండరాం వివరించారు. 
 

Trending News