Hyderabad Minor Gang Rape: మైనర్ బాలికపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం! ఆధారాలు చూపించిన రఘునందన్ రావు..

Gang Rape Update: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలిక్ గ్యాంగ్ రేప్ కేసులో మరో సంచలన వెలుగుచూసింది. గ్యాంగ్ రేప్ ఘటనతో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు

Written by - Srisailam | Last Updated : Jun 4, 2022, 02:51 PM IST
  • గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
  • ఎమ్మెల్యే కొడుకు ఉన్నారన్న రఘునందన్
  • ఎమ్మెల్యే కొడుకు ఫోటోలు విడుదల
Hyderabad Minor Gang Rape: మైనర్ బాలికపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం! ఆధారాలు చూపించిన రఘునందన్ రావు..

Gang Rape Update: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలిక్ గ్యాంగ్ రేప్ కేసులో మరో సంచలనం వెలుగుచూసింది. గ్యాంగ్ రేప్ ఘటనలో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కాని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ.. అందుకు కొన్ని ఆధారాలు చూపించారు. ఆమ్నేషియా పబ్ కు వచ్చిన మెర్సిడేజ్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్న ఫోటోలను రఘునందన్ రావు విడుదల చేశారు. ఈ కారులోనే నిందితులు పబ్ కు వచ్చారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కారులోనే ఎమ్మెల్యే కొడుకు పబ్ కు వస్తున్న ఫోటోలను రఘునందన్ రావు రిలీజ్ చేయడం కలకలం రేపుతోంది.

బాలికను పబ్ కు తీసుకొచ్చిన బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని.. బాలికపై అతను అత్యాచారం చేశాడని బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు ఆరోపించారు. తాన చూపిస్తున్న ఫోటోలో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు అవునో కాదో పోలీసులు చెప్పాలన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. మైనర్లు కాబట్టి చూపించడం లేదని పోలీసులు కథలు చెబుతున్నారని.. కాని నిర్భయ కేసులో నిందితులు మైనర్లు అయినా మీడియా ముందుకు తీసుకువచ్చారని రఘునందన్ రావు చెప్పారు. నిందితులు పబ్ కు వచ్చిన కారును వదిలేసి... ఇన్నోవా కారులో వచ్చిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు.

హైదరాబాద్ లో పోలీసుల కంట్రోల్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉందన్నారు రఘునందన్ రావు. మజ్లిస్ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మజ్లిస్ నేతల పిలలను వదిలేసి.. మిగితా వారిని విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల అరెస్ట్ ఎందుకు చూపడం లేదని రఘునందన్ రావు పోలీసులను నిలదీశారు. అధికార పార్టీ నేతలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పిల్లలు ఉన్నారు కాబట్టే.. చూపించడం లేదా అని ప్రశ్నించారు. అవసరమైతే టీఆర్ఎస్ నేతలను రిమాండ్ కు తరలిస్తారు కాని ఎంఐఎం నేతల జోలికి వెళ్లరని చెప్పారు. బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు లేరని పోలీసులు ఎలా చెబుతారని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఏ ఆధారాలతో చెప్పారని నిలదీశారు. తన దగ్గర ఉన్న ఆధారాలను డీజీపీకి ఇచ్చేందుకు సిద్ధమన్నారు.

గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని సీజేఐకి విన్నవించారు రఘునందన్ రావు. ఈ కేసు లో అసలు ముద్దాయిలు రాజకర్ల వారసులే అన్నారు రఘునందన్ రావు. తనను సవాల్ చేసినందునే కొంతమేర ఆధారాలు బయటపెడుతున్నానని చెప్పారు. నలుగురు చుట్టూ ఉన్నప్పుడు ఒక మైనర్ బాలిక ఎలా ప్రతిఘటిస్తుందని అన్నారు. అన్ని వీడియోలను, ఫోటోలను హైకోర్టు కు సమర్పిస్తానని తెలిపారు.  నిందితులు కొంతమంది దుబాయ్ ఫ్లైట్ ఎక్కినట్టు తనకు అనుమానం ఉందన్నారు రఘునందన్ రావు. రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారు నెంబర్ వివరాలు కొడితే  నిందితులు ఎవరో తెలుస్తుందన్నారు. మైనర్లు పబ్ లోకి ఎలా వచ్చారో పబ్ మేనేజర్ చెప్పాలన్నారు రఘునందన్ రావు.

READ ALSO: YS Sharmila Comments: బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ! కేసీఆర్ మోసాలకు అంతే లేదన్న షర్మిల..

READ ALSO: OMG Video: హార్స్ రేసింగ్ ట్రాక్ పైకి మెుసలి...భయంతో వణికిపోయిన గుర్రం, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News