ఊటీకి వెళ్లొచ్చేసరికి లూటీ.. !!

హైదబారాబాద్‌లోని నల్లకుంటలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తెగబడ్డారు. అర్థరాత్రి చడీ చప్పుడు లేకుండా దోచుకు వెళ్లారు. 

Last Updated : Feb 26, 2020, 11:11 AM IST
ఊటీకి వెళ్లొచ్చేసరికి లూటీ.. !!

హైదబారాబాద్‌లోని నల్లకుంటలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తెగబడ్డారు. అర్థరాత్రి చడీ చప్పుడు లేకుండా దోచుకు వెళ్లారు.  

హైదరాబాద్ నల్లకుంట  తిలక్ నగర్‌లోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు.  ఇంట్లో ఉన్న వారు ఊటీకి వెళ్లిన సమయంలో లూటీ జరిగింది.  కాకినాడ ఇంద్రపాలెంకు చెందిన   అనుసూరి శివశంకర్ సాప్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. నల్లకుంట తిలక్ నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఈ మధ్యే పెళ్లి వేడుకలు జరుపుకునేందుకు ఆయన భార్యతో కలిసి తమిళనాడులోని ఊటీకి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో చోరీ జరిగింది. పగటి పూట రెక్కీ నిర్వహించిన దొంగలు రాత్రి పూట కన్నం వేశారు. ఇంటి కిటికీలు పగులగొట్టి లోపలికి దూరారు. బీరువాలో ఉన్న 32 తులాల బంగారు ఆభరణాలతోపాటు కిలో వెండి వస్తువులు తీసుకుని ఉడాయించారు. 

Read Also: అమెరికన్లకు ఆ విషయం తెలియదా..?

ఇంటి కిటికీలు పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని శివశంకర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆయన వచ్చిన తర్వాత చూడగా.. బంగారు, వెండి వస్తువులు పోయినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read Also: కరివేపాకుతో షుగర్ కంట్రోల్, ఎన్నో ప్రయోజనాలు

Trending News