COVID-19: తెలంగాణలో కోవిడ్ నివారణపై కేంద్రం ఆరా

గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన  కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం శనివారం తనిఖీ చేసింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్‌లో కరోనా ఐసోలేషన్ కేంద్రానికిగాను ప్రత్యేకంగా 1,500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Apr 25, 2020, 07:22 PM IST
COVID-19: తెలంగాణలో కోవిడ్ నివారణపై కేంద్రం ఆరా

హైదరాబాద్: గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన  కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం శనివారం తనిఖీ చేసింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్‌లో కరోనా ఐసోలేషన్ కేంద్రానికిగాను ప్రత్యేకంగా 1,500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆస్పత్రిని సందర్శించిన ఈ కేంద్ర బృందానికి పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రమేష్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులు ఈ ఆసుపత్రిలో చేసిన ఏర్పాట్లు, ప్రత్యేకతలను వివరించారు.

 

Also read : లాక్ డౌన్ తర్వాత ఈ మెట్రోలో ఇవి తప్పనిసరి

కోవిడ్-19 పాజిటివ్ కేసుల కోసమే ప్రత్యేక ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో టెస్టింగ్ కిట్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు, అందుబాటులో ఉండే సేవల గురించి అధికారులతో సమీక్షించారు. అలాగే కరోనా వైరస్ కంటైంన్మెంట్ కోసం తెలంగాణ సర్కార్ ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలను కూడా కేంద్ర బృందం పరిశీలించింది.

Also read : లాక్ డౌన్ పరిమితి సడలింపు..!!

గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందంలో భారత ప్రభుత్వ జల శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా, పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, జాతీయ కన్జ్యూమర్ అఫైర్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్. ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News