BRS MLC Kalvakuntla Kavitha: కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్న ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kalvakuntla Kavitha: నిజామాబాద్ : అన్ని ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. లడ్డాఖ్‌కు వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ గౌతం ఆదానిని విమర్శించారని, మరి అదే విమర్శలను రాజస్థాన్‌లో చేయగలరా అని ప్రశ్నించారు. 

Written by - Pavan | Last Updated : Sep 15, 2023, 05:31 AM IST
BRS MLC Kalvakuntla Kavitha: కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్న ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kalvakuntla Kavitha: నిజామాబాద్ : అన్ని ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. లడ్డాఖ్‌కు వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ గౌతం ఆదానిని విమర్శించారని, మరి అదే విమర్శలను రాజస్థాన్‌లో చేయగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఆదానితో కలిసి ప్రాజెక్టులు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. చతిస్‌ఘడ్‌లో ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఆదివాసుల ఆందోళన తీవ్రతరం చేయడంతో ఆదానితో ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం నిజం కాదా అని అడిగారు. 

గురువారం రోజున నిజామాబాద్‌లో మీడియా ప్రతినిధులతో కవిత ఇష్టా‌గోస్టిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిక్లరేషన్ల పేరిట తెలంగాణలో హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో ఎందుకు వాటిని అమలు చేయలేదని అడిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలను కనీసం ఇప్పుడు  ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయినా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టడం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని హితవు పలికారు. 

కాంగ్రెస్ పార్టీ సమావేశం కోసం వస్తున్న నాయకులు తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వీకరించి అమలు చేస్తుందని అన్నారు. కాబట్టి తెలంగాణ అభివృద్ధిని అధ్యయనం చేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎజెండాగా పెట్టుకోవాలని అన్నారు.  తమ పార్టీ ఇప్పటివరకు అమలు చేస్తున్న పథకాలనే కాపీ కొట్టి కాంగ్రెస్ హామీలు ఇస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేలా ఏమి చేయడం లేని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పరిపాలించడానికి 60 ఏళ్ల పాటు ప్రజలు సమయం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. 

రెండు కోట్ల ఉద్యోగాల కల్పిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు కోసం దీక్ష చేయాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సూచించారు. కిషన్ రెడ్డి దీక్ష చేయాల్సింది హైదరాబాదులో కాదని, ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం ముందు దీక్ష చేయాలని కిషన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలతో ప్రైవేటు రంగంలో 35 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ నేనని స్పష్టం చేశారు.

Trending News