అగ్నికి ఆహుతైన 108 అంబులెన్స్ వాహనాలు

శామీర్‌పేటకు సమీపంలోని దేవరయాంజల్ వద్ద వున్న జీవికే కార్యాలయం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Last Updated : May 7, 2019, 02:57 PM IST
అగ్నికి ఆహుతైన 108 అంబులెన్స్ వాహనాలు

హైదరాబాద్: శామీర్‌పేటకు సమీపంలోని దేవరయాంజల్ వద్ద వున్న జీవికే కార్యాలయం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింట్ స్థలంలో వున్న ఎండు గడ్డిలో అంటుకున్న మంటలు అక్కడే నిలిపేసి వున్న పాత అంబులెన్స్ వాహనాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 వరకు అంబులెన్సులు దగ్ధమైనట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. సర్కార్ అంబులెన్సులే అయినప్పటికీ.. 108 సేవలను జీవిఎంకే-ఈఎంఆర్ఐ నిర్వహిస్తుండటంతో వాటిని అక్కడ పార్క్ చేసినట్టు తెలుస్తోంది. 

ఈ ప్రమాదం కారణంగా భారీగానే ఆస్తినష్టం వాటిల్లినప్పటికీ.. అక్కడ పార్క్ చేసి వున్న వాహనాలన్నీ వేలం వేయడానికి సిద్ధంగా వున్న పాత వాహనాలు కావడంతో కొంత మేర ఆస్తి నష్టం తీవ్రత తగ్గినట్టు సమాచారం. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

Trending News