అమీర్ పేట - హైటెక్ సిటీ మధ్య మెట్రో  పరుగులు షురూ 

                                    

Last Updated : Mar 20, 2019, 12:11 PM IST
అమీర్ పేట - హైటెక్ సిటీ మధ్య మెట్రో  పరుగులు షురూ 

హైదరాబాద్: అమీర్ పేట - హైటెక్ సిటీ  మధ్య మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమయ్యారు. ఈ మేరకు ఉదయం 9:30 గంటలకు అమిర్ పేట మెట్రో స్టేషన్ లో గవర్నర్ నరసింహన్ రెండా ఊహి మెట్రో సర్వీసులను ప్రారంభించారు. కాగా సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 

మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్ వేర్ సంస్థలతో పాటు ఇతర సంస్థల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ కార్యాలయాలకు సకాంలో చేరుకునే విషయంలో ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

‘మెట్రో’ సేవలు అందుబాటులోకి రావడంతో ఉద్యోగుల కష్టాలు తీర్చినట్లుయింది. ఈ మార్గంలో మెట్రో రైలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చినట్లయింది.

Trending News