Raksha Bandhan Sale: రాఖీ పౌర్ణమి సేల్‌తో భారీగా తగ్గిన Redmi మొబైల్స్‌..ఈ సైట్‌లో సగం ధరలకే స్మార్ట్‌ ఫోన్స్!

Raksha Bandhan Sale For Mobile: రాఖీ పౌర్ణమి సందర్భంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ లభిస్తున్నాయి. రెడ్‌మీకి సంబంధించిన కొన్ని మొబైల్‌ ఫోన్స్‌పై అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌ సంబంధించిన పూర్తీ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2023, 03:52 PM IST
Raksha Bandhan Sale: రాఖీ పౌర్ణమి సేల్‌తో భారీగా తగ్గిన Redmi మొబైల్స్‌..ఈ సైట్‌లో సగం ధరలకే స్మార్ట్‌ ఫోన్స్!

Raksha Bandhan Sale For Mobile: ప్రముఖ టెక్‌ కంపెనీ రెడ్‌ మీ రాఖీ సందర్భంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేకే ఆఫర్స్‌ను అందిస్తోంది. మీ సోదరలకు మంచి స్మార్ట్‌ ఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ Redmi కంపెనీకి చెందిన కొన్ని ప్రత్యేక మొబైల్స్‌పై 25 శాతం కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు కస్టమర్స్‌ను ఆకర్శించేందుకు బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది కంపెనీ. ఈ సేల్‌ భాగంగా Redmi కొన్ని మొబైల్స్‌ ఫోన్‌ ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా అందిస్తోంది. అయితే ఈ సేల్‌ సంబంధించిన టాప్‌ 3 డీల్స్‌ మనం తెలుసుకుందాం. 

Redmi Note 12:
ప్రస్తుతం రెడ్‌మీ వెబ్‌సైట్‌లో Redmi Note 12 స్మార్ట్ ఫోన్‌ 6 GB ర్యామ్‌.. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 20,999 విక్రయిస్తోంది. కానీ రాఖీ పండగ సందర్భంగా ఈ Redmi Note 12 మొబైల్‌  రూ. 15,999లకే లభిస్తోంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే..ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో పాటు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు

Redmi Note 12 5G:
రాఖీ పండగ సందర్భంగా రెడ్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో Redmi Note 12 5Gపై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ రూ. 23,999లకు విక్రయిస్తోంది. అయితే పండగ ఆఫర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్‌ ఫోన్‌ను రూ. 20,999లకే అందిస్తోంది. ఇక ఈ మొబైల్‌ ఫోన్‌పై అదనంగా రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు మీ పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేసి ఈ Redmi Note 12ను కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 

Xiaomi 13 Pro:
రెడ్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. 12 GB ర్యామ్‌, 256 GB వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ అధికారిక వెబ్‌ సైట్‌లో కంపెనీ రూ. 89,999లకు విక్రయిస్తోంది. అయితే కంపెనీ రాఖీ పండగా సందర్భంగా ఈ మొబైల్‌ ఫోన్‌ను కేవలం రూ.79,999లకే అందిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ను ICICI బ్యాంక్ కార్డు వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 8,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు అదనంగా  ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానిరి రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News