వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టు ఇదే

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.

Last Updated : Jul 21, 2019, 11:21 PM IST
వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టు ఇదే

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. వెస్ట్ ఇండీస్‌లో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుండగా టెస్టు జట్టులో తెలుగు తేజం హనుమ విహారీకి అవకాశం లభించింది. గాయం కారణంగా ప్రపంచ కప్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చిన శిఖర్ ధావన్‌ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టెస్ట్ మినహా వన్డే, టీ20 ఫార్మాట్లలో జరగనున్న మ్యాచ్‌లలో శిఖర్ ధావన్ టీమిండియా తరపున ఆడనున్నాడు. 

వెస్ట్ ఇండీస్ టూర్‌లో పాల్గొననున్న మూడు ఫార్మాట్లకు సంబంధించిన జట్లు ఇలా వున్నాయి. 
వన్డే జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనిష్ పాండే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర ఛాహల్, కేదార్ జాదవ్, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ

టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, సి. పుజారా, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వర్ధమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్
 
టీ20 జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, కృణాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ

Trending News