నేను నేత్రదానం చేయను.. మీరు చేయండి..!

భారత అంధుల క్రికెట్‌ జట్టుకు అంబాసిడర్‌ లాంటి వ్యక్తినని చెప్పుకున్న మాజీ క్రికెటర్‌ సయిద్‌ కిర్మాణీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jan 9, 2018, 01:39 PM IST
నేను నేత్రదానం చేయను.. మీరు చేయండి..!

భారత అంధుల క్రికెట్‌ జట్టుకు అంబాసిడర్‌ లాంటి వ్యక్తినని చెప్పుకున్న మాజీ క్రికెటర్‌ సయిద్‌ కిర్మాణీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "అంధ క్రికెటర్ల అంకితభావం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే నేను కూడా నేత్రదానానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుతున్నాను" అని ఇటీవలే ఓ కార్యక్రమంలో చెప్పిన ఆయన.. రెండు రోజుల్లోనే మళ్లీ తన మాటను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

"నాకు ఉద్వేగం ఎక్కువ. అవయవదానంపై డాక్టర్‌ మోహన్‌ రాజ్‌ పెడుతున్న సదస్సుల గురించి విని నేను కూడా నేత్రదానం చేస్తానని తెలిపాను. అయితే పలు మతపరమైన ఇబ్బందుల వల్ల నా మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను.. కానీ అందరూ నేత్ర దానం చేయాలని కోరుతున్నాను" అని ఆయన ప్రకటించారు. చెన్నైలో శనివారం మద్రాస్‌ రోటరీ క్లబ్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కిర్మాణీ తను కూడా నేత్రదానం చేయనున్నట్లు తెలిపారు. 

Trending News