India vs Pakistan Match: టీమ్ ఇండియా రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్

ICC T20 World Cup 2021 India vs Pakistan Match చాలా పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది. పాకిస్తాన్ జట్టుపై టీమ్ ఇండియాకున్న రికార్డును చెరిపేసింది. మరోవైపు పాకిస్తాన్ తొలి విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 25, 2021, 06:58 AM IST
  • టీమ్ ఇండియా రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్ జట్టు
  • టీ20 వరల్డ్‌కప్, వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్తాన్ పై టీమ్ ఇండియా 12-0 ఆధిక్యానికి బ్రేక్
  • టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాపై పాకిస్తాన్ తొలి విజయం నమోదు
India vs Pakistan Match: టీమ్ ఇండియా రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్

ICC T20 World Cup 2021 India vs Pakistan Match చాలా పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది. పాకిస్తాన్ జట్టుపై టీమ్ ఇండియాకున్న రికార్డును చెరిపేసింది. మరోవైపు పాకిస్తాన్ తొలి విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది.

దాయాదులపోరులో పాకిస్తాన్ సాధించిన విజయంతో టీమ్ ఇండియా రికార్డు బ్రేక్ (Team India)అయింది. ఆదివారం జరిగిన టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీమ్ ఇండియా వర్సెస్ టీమ్ పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్(Pakistan)చరిత్ర తిరగరాసింది. ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్‌లో ఇండియాపై తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరున ఉన్న రికార్డు కొనసాగింది. దుబాయ్ స్డేడియంలో బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా 11 మ్యాచ్‌లలో విజయం సాధించి ఓక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పుడా రికార్డు కొనసాగినట్టైంది. పాకిస్తాన్ ఓపెనర్లు సరికొత్త రికార్డు సాధించారు. 

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) పాకిస్తాన్..టీమ్ ఇండియాపై తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకూ టీ20 వరల్డ్‌కప్‌లలో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఐదుసార్లు తలపడగా..ప్రతిసారీ ఇండియానే విజయం సాధించింది. ఇప్పుడా రికార్డు బ్రేక్ అయింది. మరోవైపు టీమ్ ఇండియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజమ్(Babar Azam), మొహమ్మద్ రిజ్వాన్‌లు టీమ్ ఇండియా విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేధించారు. 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్తాన్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించగలిగింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్ 52 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, మొహమ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) 55 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఆటతీరు చూస్తే ఇంత కసి దాగుందా అన్పిస్తుంది. ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం పాకిస్తాన్ జట్టుకు ఇదే కావడం విశేషం. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లలో వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించడం కూడా ఇదే. ఆ ఘనత పాకిస్తాన్ దక్కించుకుంది. 

ఇక ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా మరో రికార్డు బ్రేక్ అయింది. ఇప్పటి వరకూ వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ కలిపి టీమ్ ఇండియా.. పాకిస్తాన్‌పై 12-0 ఆధిక్యతతో ఉంది. ఈ మ్యాచ్ విజయంతో పాకిస్తాన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. 12-1తో నిలిచింది. 

Also read: Pakistan Openers Record: టీమ్ ఇండియా మ్యాచ్‌తో సరికొత్త రికార్డు సాధించిన పాక్ ఓపెనర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News