TTD Donation: కొన్నేళ్ల తర్వాత టీటీడీకి ఊహించనంత భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారో తెలుసా?

Trident Group Donation To TTD: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు తమకు తోచిన స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కరోజే రూ.21 కోట్ల భారీ విరాళం తిరుమల దేవస్థానానికి అందింది. 

1 /6

TTD Donation: టీటీడీకి ఒక్కరోజే భారీ మొత్తంలో విరాళం కొన్నేళ్ల తర్వాత రావడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. అయితే ఆ విరాళం ఎవరు ఇచ్చారు? ఏ సేవకు ఇచ్చారో తెలుసుకోండి.

2 /6

TTD Donation: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు ఆదివారం దాతలు రూ.21 కోట్ల భారీ విరాళం అందించారు.

3 /6

TTD Donation: పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన రాజిందర్ గుప్తా ఆ విరాళం అందించారు.

4 /6

TTD Donation: టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సి వెంకయ్య చౌదరికి దాతలు చెక్కును అందించారు.

5 /6

TTD Donation: విరాళం అందించిన రాజిందర్‌ గుప్తా కుటుంబసభ్యులను టీటీడీ అధికారులు సన్మానించారు. వారికి జ్ఞాపికలు అందించారు.

6 /6

TTD Donation: అంతకుముందు రాజిందర్‌ గుప్తా కుటుంబసభ్యులు శ్రీవారిని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం టీటీడీ ఏఈఓ కార్యాలయానికి చేరుకుని చెక్కు ఇచ్చారు.