Shravana Masam 2024: శ్రావణ మాసం 4 శుక్రవారాలు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట తాండవిస్తుంది.. ఆమెకు కోపం తెప్పించే 2 విషయాలు..

Shravana Masam 2024 Puja: శ్రావణ మాసంలో శుక్రవారాలు ఇలా చేస్తే మీకు అశేష ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మి దేవి నిత్యపూజ చేస్తే ఆ ఇంట్లో దరిద్రం ఉండదు. ఆర్థిక సమస్యలు ఉన్న దంపతులు కలిసి చేసుకోవాలి. ఉదయం పూజ భార్యభర్తలు కలిసి చేసుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు.
 

1 /5

ఈ పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇలా నాలుగు శుక్రవారాలు చేస్తే దరిద్రం తొలగిపోతుంది.  

2 /5

పీఠం వేసి బియ్యం పోయాలి. దానిపై బట్ట వేసుకుని కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో బియ్యం, రూపాయి బిళ్ల మామిడి ఆకులు వంటివి పెట్టి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజకు కలశ ఆరాధన, గణపతి పూజ చేసిన తర్వాత షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అంగ పూజ లక్ష్మి అష్టోత్తరాలు, కనక ధార స్తోత్రం చదవాలి. ఆ తర్వాత నైవేద్యాలు పెట్టాలి. 

3 /5

ముఖ్యంగా తొమ్మిది దారాలు తీసుకుని దానికి తొమ్మిది మూడులు వేసి వాటికి పూజలు చేయాలి. మీరు కుడి చేతికి కట్టించుకోవాలి. ఆ తర్వాత వ్రత కథ చదవాలి.  

4 /5

ఇది చారుమతి అనే మహిళ మొట్టమొదటిసారిగా చేసిన కథ ఇది ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఒకసారి ఈమెకు లక్ష్మిదేవి కలలో కనిపించి వరలక్ష్మి దేవి వ్రతం చేయమని కోరిందట. దీంతో ఆమె అందరినీ పిలిచి వ్రతం చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తుంటే పట్టీలు, బంగారు గాజులు వంటివి వచ్చాయని చెబుతారు.  

5 /5

ఈ కథ తర్వాత వాయనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, లక్ష్మీదేవికి కోపం తెప్పించే రెండు విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి అతిగా ఖర్చు పెట్టడం, రెండోది భార్యను నిందించడం, ఆమెను నిర్లక్ష్యంగా చూడటం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)