Renudesai: పవనే నన్ను వదిలేశాడు.. నేను కాదు .. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

Renudesai: పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని.. రేణు దేశాయ్ ను ట్యాగ్ చేసి .. మా దేవుడు (పవన్ కళ్యాణ్ )ని అర్ధం చేసుకోకుండా వెళ్లిపోయారంటూ కూడా పోస్టులు పెట్టాడు. 

1 /6

 పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు  ఇటీవల సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ను ట్యాగ్ చేసి వదినమ్మ అంటూ..  మా దేవుడిని పెళ్లిచేసుకుని ఆయన ఆంతరంగం తెలియకుండా  వెళ్లిపోయారంటూ కూడా పోస్టులు పెట్టాడు. అంతటితో ఆగకుండా.. కొన్నేళ్లు ఓపిక పట్టిఉంటే బాగుండేదంటూ కూడా కామెంట్లు పెట్టాడు.

2 /6

దీనికి రేణుదేశాయ్ అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఆయన (పవన్ కళ్యాణ్) నన్ను వదిలేసి మరో పెళ్లిచేసుకున్నారు.. నేను కాదంటూ క్లారిటీ ఇచ్చారు. తనను టార్చర్ పెట్టడం మానేయాలని కౌంటర్ ఇచ్చారు. 

3 /6

తన వద్ద మరోసారి నా గతంలో జరిగిన పెళ్లి ప్రస్తావన గురించి మాట్లాడోద్దంటూ కూడా గట్టిగానే చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ సోషల్ మీడియాలో కామెంట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ ఫిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు.

4 /6

అంతేకాకుండా.. రేణు కుమారుడు అకీరానందన్ పవన్ ను అంటిపెట్టుకుని ఉంటున్నాడు. ఎక్కడకు వెళ్లిన కూడా తండ్రితోనే అకీరా కన్పిస్తున్నాడు.  పవన్ కూడా అకీరాతో కాస్త స్పెషల్ గా బాండింగ్ ఏర్పడినట్లు కూడా నెటిజన్లు కామెంట్ లు పెడుతున్నారు. మోదీతో కలిసినప్పుడు, చంద్రబాబు బ్లేస్సింగ్ తీసుకొమ్మని కూడా పవన్ అకీరా కు చెప్పారు. 

5 /6

అకీరా, ఆద్యలు పవన్ కళ్యాణ్ తో ఇటీవల ఎక్కువగా కలిసి ఉంటున్నారు. వీరి బాండింగ్ చూసి పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోష పడుతున్నారు. మరోవైపు పవన్ అభిమాని చేసిన వ్యాఖ్యల వల్ల రేణుదేశాయ్ మరోసారి వార్తలలో నిలిచారు. 

6 /6

ఈ నేపథ్యంలో.. రేణుదేశాయ్.. ఆయనే నన్ను వదిలేశారు.. నేను కాదు అని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. పవన్, రేణుదేశాయ్ లు ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నా లేజినోవాను పవన్ మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.