EPFO Latest Updates: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. నెలకు రూ.9 వేలు గ్యారంటీ పెన్షన్.. కేంద్రానికి రిక్వెస్ట్..!

EPFO Minimum Pension: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)తో ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. ఈ పథకం కింద 25 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు చివరి 12 నెలలలో పొందిన సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌ను అందుకుంటారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ పథకం (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) కింద నెలవారీ కనీస పెన్షన్‌ను పెంచాలనే డిమాండ్‌ చేస్తున్నారు. 
 

1 /8

ఇటీవల చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది. డీఏతోపాటు నెలవారీ కనీస పెన్షన్‌ను రూ.9 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.  

2 /8

దాదాపు 75 లక్షల మంది పింఛన్‌దారులు ఈపీఎస్‌ పరిధిలో ఉన్నారని.. యూపీఎస్ తరహాలో గ్యారంటీ పెన్షన్ అందజేయాలని లేఖలో పేర్కొంది.   

3 /8

ఈ ఏడాది జూలైలో పెన్షనర్ల సంస్థ EPS- 95 జాతీయ ఆందోళన కమిటీ కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కి పెంచాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో దాదాపు 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు.  

4 /8

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్ 1995 స్కీమ్) పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు నెలకు రూ.1,000 కనీస పెన్షన్‌ను కేంద్రం 2014లో ప్రకటించింది. అయితే ఈపీఎస్-95 కింద ఇచ్చే పెన్షన్‌ను నెలకు రూ.2 వేలకి రెట్టింపు చేయాలని సిఫార్సు చేస్తూ కార్మిక మంత్రిత్వ శాఖ గతేడాది ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు.  

5 /8

ఏదైనా కంపెనీ లేదా సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగుల బేసిక్ పేలో 12 శాతం పీఎఫ్ ఫండ్‌లో జమ అవుతుంది. అదే మొత్తంలో కంట్రిబ్యూషన్ కంపెనీ నుంచి PFకి వెళ్తుంది.   

6 /8

అయితే కంపెనీ సహకారం రెండు భాగాలుగా ఉంటుంది. ఇందులో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) అంటే పెన్షన్ ఫండ్‌లో డిపాజిట్ అవుతుంది. 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్‌లో జమ అవుతుంది.  

7 /8

ఉదాహరణకు ప్రాథమిక జీతం రూ.10 వేలు అయితే.. కంపెనీ నుంచి 8.33 శాతం సహకారం అంటే రూ.833 కూడా ఉద్యోగి ఈపీఎస్‌ ఖాతాలో వసూలు అవుతుంది. ప్రతి సంవత్సరం జీతంలో 10 శాతం ఇంక్రిమెంట్ పొందితే.. కంపెనీ సహకారం కూడా పెరుగుతుంది. 

8 /8

ఈపీఎస్ కింద ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పెన్షన్‌కు అర్హులు అవుతారు. పెన్షన్ పొందాలంటే ఒకే యూఎఎన్ కింద పదేళ్ల సర్వీస్ పూర్తి చేయాలి.